వలస కార్మికులకు కరోనా

సిరిసిల్ల,(ఆరోగ్యజ్యోతి): బతుకు దెరువు కోసం మహారాష్ట్ర వలస వెళ్లిన వారి పాలిట కరోనా మహమ్మారి పెను శాపంగా మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువై  సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు ఇద్దరికి  కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయింది. వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లి  గ్రామానికి చెందిన వలస కార్మికుల్లో ఒకరికి, వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన మరొకరికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు.