రోమ్: కరోనా కట్టడికి ప్రపంచంలోనే తొలివ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు ఇటలీకి చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ‘టకీస్’ ప్రకటించుకుంది. రోమ్లోని లజారో స్పాలన్జానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజె్సలో ఎలుకలపై జరిపిన ప్రయోగ పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చినట్లు తెలిపింది. వ్యాక్సిన్లోని యాంటీబాడీలు(ప్రతిరక్షకాలు) శరీర కణాలను చైతన్యపరిచి, కరోనా వైరస్ చొరబడకుండా అడ్డుకుంటాయని ఆ కంపెనీ సీఈవో ల్యూగి ఆరిసిచియో వెల్లడించారు. వేసవి కాలం తర్వాత మనుషులపై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారని ఇటలీ వార్తాసంస్థ ‘ఏఎన్ఎ్సఏ’ తెలిపింది.