మెడికల్ దుకాణంలో తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామంలో మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తనిఖీలు నిర్వహించారు. వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న జయ సాయి దుకాణ యజమాని పై కేసు నమోదు చేశారు. జ్వరం, దగ్గు మాత్రలు విక్రయించే యజమానులు తప్పనిసరిగా వినియోగదారుని వివరాలు. సేకరించాలని వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.