వరదయ్యపాలెం,(ఆరోగ్యజ్యోతి): కరోనా కారణంగా దేశం మొత్తం దాదాపు 50 రోజులుగా లాక్ డౌన్ విదంచడంతో ఉపాధి లేక చేతిలో ఖర్చులకు డబ్బులు లేక తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా 130 మంది వలస కార్మికులకు బి ఇ పి సి ఫౌండేషన్ ను సహాయం అడుగగా వెంటనే స్పందించి శనీవారంనాడు నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వరదయ్యపాలెం పంచాయతీ ఈఓ యూసఫ్ ఖాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ వలస కూలీల ఆకలి తిరుస్తున్న బి ఇ పి సిఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రియాజ్, సుకుమార్, హుస్సేన్, మాచల్, తదితరులు పాల్గొన్నారు.