భద్రాద్రి కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి తండ్రీకొడుకులతో పాటు మేనల్లుడు మృతిచెందాడు. మృతులు నల్లమోతు అప్పారావు(తండ్రి), కొడుకు తేజ్, మేనల్లుడు వినయ్ ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.