కదిరి,(ఆరోగ్యజ్యోతి): మే డేను పురస్కరించుకుని ఈ రోజు కదిరి మార్కెట్ యార్డ్ లో సిఐటియు ఆధ్వర్యంలో హమాలిలు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జీ.ఎల్. నరసింహులు, సాంబశివ, రామ్మోహన్, హమాలి యూనియన్ నాయకులు శివ, ఫక్రుల్ల, రాము, చండ్రయుడు, మహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు .సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గానికి స్ఫూర్తినిచ్చే రోజు మే డే అన్నారు. ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాడి చనిపోయిన అమరలుకు నివాళులర్పించే రోజు మేడే అన్నారు. కార్మిక వర్గం తమ పోరాటాలను సమీక్షించుకుని ముందడుగు వేసే రోజు మేడే అని వివరించారు.1886 లో ఇంగ్లాండ్ లో మొదలైన కార్మికోద్యమం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింద న్నారు. మొట్టమొదట అమెరికాలోని చికాగో నగరంలో మొత్తం కార్మికులు సమావేశమై ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాటానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. నేడు మనదేశంలో బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాల కు తూట్లు పొడిచే విధంగా పనిగంటలు పెంచాలని చూస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపినారు.