ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు చిన్న పరిశ్రమలు, రెండో రోజు వలస కూలీలు, రైతులు, మూడవ రోజు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సహక ప్యాకేజీ ప్రకటించారు. నేడు నాల్గవ విడత ఆర్థిక ప్యాకేజీని మంత్రి మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తున్నారు.