తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలివే..

లాక్ డౌన్ తొందరలోనే ముగియనుంది. ఇక ఒక్కొక్కటిగా ప్రజా రవాణాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానుండగా.. ప్యాసింజర్ రైళ్లు జూన్ 1 నుంచి మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా ఆ రోజు నుంచి నడిచే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. ఇవాళ ఉదయం నుంచి వీటి బుకింగ్ ప్రారంభం కానుండగా.. మొత్తం 200 రైళ్లకు సంబంధించి వివరాలు విడుదలయ్యాయి. వీటిని స్పెషల్ ట్రైన్స్‌గానే రైల్వేశాఖ నడపనుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.



  1. ముంబై CST- హైదరాబాద్( హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్)

  2. హౌరా – సికింద్రాబాద్ (ఫలక్ నామా ఎక్స్ ప్రెస్)

  3. న్యూఢిల్లీ – హైదరాబాద్ ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

  4. విశాఖ – న్యూఢిల్లీ( ఏపీ ఎక్స్ ప్రెస్)

  5. గుంటూరు – సికింద్రాబాద్(గోల్కొండ ఎక్స్ ప్రెస్)

  6. తిరుపతి – నిజామాబాద్( రాయలసీమ ఎక్స్ ప్రెస్)

  7. హైదరాబాద్ – విశాఖ( గోదావరి)

  8. సికింద్రాబాద్ – నిజాముద్దీన్(దురంతో).. వీటితో పాటు ఇంకొన్ని రైళ్లు తెలుగు రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి