ఆరోగ్యసేతు త‌ప్ప‌నిస‌రి: ‌కేంద్ర హోంశాఖ‌

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో దేశ ప్ర‌జ‌లంద‌రూ త‌మ మొబైల్ ఫోన్ల‌లో ఆరోగ్య‌సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు ప్రజలందరికీ ఆరోగ్యసేతు యాప్ తప్పనిసర‌ని కేంద్ర హోంశాఖ‌ ప్రకటించింది. ‌కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమని హోంశాఖ పేర్కొన్న‌ది. ఏప్రిల్ మొద‌టి వారంలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ యాప్‌వ‌ల్ల‌ కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని, దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని, అందుకు అధికారులు కూడా సహకరించాలని హోంశాఖ సూచించింది. ఇప్పటికే ఈ యాప్‌ను వాడుతున్న వారిసంఖ్య దేశంలో ఏడున్నర కోట్లకు చేరింద‌ని కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది.