లాక్‌డౌన్‌పై తెలంగాణ బాటలో మరో రెండు రాష్ట్రాలు

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మే నెలాఖరు వరకూ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటమే ఇందుకు కారణం. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 27 వేలు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్యే 20 వేలు దాటడం గమనార్హం. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. ఇక తమిళనాడులో కూడా కోయంబేడు మార్కెట్‌తో సంబంధమున్న కేసులు రోజుకు వందల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. దీంతో.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని భావిస్తున్నారు.