ఒకే కుటుంబంలో మరో ఏడుగురికి  

 


 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): నగరంలో కరోనా బారిన పడిన కానిస్టేబుల్‌ ద్వారా అతని కుటుంబ సభ్యులు ఏడుగురికి వైరస్‌ సోకింది. తల్లి(50), తండ్రి(55), తాతయ్య(75), చిన్నాన్న(43), చిన్నమ్మ(40), చిన్నాన్న కూతురు(14), బావమరిది(26)లకు పాజిటివ్‌ రావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి నెగెటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉంచారు. మేడిపల్లి స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు గత నెల 22న జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 30న పాజిటివ్‌ అని తేలింది.