గురువారం తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి)‌: తెలంగానలో కరోనా మహమ్మారి రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2699 కి చేరింది. కొత్తగా వచ్చిన కరోనా కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3147 కు చేరింది. కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 110 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. మిగిలిన 17 కేసుల్లో అదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డిలో 1, ఖమ్మంలో 1 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స తీసుకుని నయం అయిన కేసులు 1587 ఉన్నాయి. కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 105 మంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 1455గా ఉంది.