న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఇప్పటివరకు 480 మంది కరోనా పాటివ్లుగా తేలారు. ఇందులో 19 మంది డాక్టర్లు ఉండగా, 38 నర్సులు, 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్ సిబ్బంది ఉంన్నారు. 19 డాక్టర్లలో ఇద్దరు ప్రొఫెసర్లు ఉంగా, మిగిలినవారు రెసిడెంట్ డాక్టర్లు. కరోనాతో ఈ అత్యున్నత దవాఖానలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు వైద్య సిబ్బంది ఉండగా, మరొకరు హాస్పిటల్ శానిటేషన్ సిబ్బందికి ఇన్చార్చి ఉన్నారు. హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని క్వారంటైన్కు తరలించారు. కరోనా వైరస్తో హాస్పిటల్లో మార్చి నెలలో ఔట్పేషెంట్ విభాగాన్ని మూసివేశారు. ఇలా ఔట్పేషెంట్ విభాగాన్ని మూసివేయడం దవాఖాన చరిత్రలో ఇదే మొదటిసారి. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ట్రౌమాకేర్ సెంటర్ను కరోనా ప్రత్యేక వార్డుగా మార్చారు. డాక్టర్లు, నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో రాజధాని నగరంలోని హిందూరావు హాస్పిటల్, బాబు జగ్జీవన్రామ్ మెమోరియల్ హాస్పిటల్, ఢిల్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏప్రిల్ నెలలో సీజ్ చేశారు. ఇలా కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైరద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.