మొక్కలు పెంచండి..పర్యావరణాన్ని కాపాడండి



తొర్రూర్,(ఆరోగ్యజ్యోతి): గాలి, నీరు, నిప్పు, నేల, అంబరం, వనం లేకపోతే ప్రకృతే లేదని ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్  ప్రసిడెంట్ విమల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తొర్రూర్ కస్తూరి బా పాటశాలలో మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా నేలపై చూసేది మనకు నిత్యం కనపడేటివి నీరు, నేల, అడవి. ఇవి సమృద్ధిగా ఉండేది మన దేశంలోనే. మన దేశంలో నే అన్నారు. చెట్లు వన్యప్రాణులు లేకుంటే పర్యావరణం కారణంగా మనిషి ఆర్థిక వృద్ధి జరిగేదే కాదని తెలిపినారు. వృక్షో రక్షతి రక్షిత: ప్రస్తుతం పర్యావరణం అతలాకుతలమౌతోంది. అడవులు అత్యధికంగా ఉన్న మన దేశంలోనే అడవులను నరికివేస్తున్నారు. అందులోనున్న కలపను తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. దీంతో అడవులు తరగిపోతున్నాయి. దీనికి తోడు వన్యప్రాణుల సంఖ్యకూడా అంతరించిపోతోందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాటశాల స్పెసల్  అధికారి  శైలజ, విజయ , నీలమ్మ,రజిత, పల్లవి, మంజుల, వెంకట లక్ష్మి,మాధవి, కవిత, పద్మ , అలువేరు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.