తాంసీ (ఆరోగ్య జ్యోతి): తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని నిపాని సబ్ సెంటర్ అనుబంద గ్రామమైన తాంసీ (కే)గ్రామంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కార్యకర్త (ఏ ఎన్ ఎం) లు బీట్రూట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త (ఏ ఎన్ ఎం) అరుణ, పుష్పలతలు మాట్లాడుతూ గర్భవతులకు రక్తం తక్కువగా ఉంటుందని రక్తం పెరిగేందుకు ఏది ఎంతగానో పని చేస్తుందని గర్భిణీ స్త్రీలకు బీట్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ సకాలంలో పోషకాహారం తీసుకొన్నట్లయితే తల్లి పుట్టబోయే బిడ్డ బాగుంటారని వారు తెలిపినారు. గర్బిని లు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగన్వాడీ కార్యకర్త సుగుణ , ఆశ కార్యకర్త త్రివేణి తదితరులు పాల్గొన్నారు.