హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3048 కి చేరింది. కొత్తగా వచ్చిన కరోనా కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3496 కు చేరింది.కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో 152 జీహెచ్ఎమ్సీలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 10, మేడ్చల్లో 18, నిర్మల్లో 5, యాదాద్రిలో 5, మహబూబ్నగర్లో 4, మహబూబాబాద్లో 1, జగిత్యాలలో 2, కరీంనగర్లో 1, మంచిర్యాలలో 1, వికారాబాద్లో 1, జనగామలో 1, నాగర్కర్నూల్లో 2, గద్వాలలో 1, నల్గొండలో 1, భద్రాద్రిలో 1 కేసులు నమోదయ్యాయి.ఇక రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స తీసుకుని నయం అయిన కేసులు 1710 ఉన్నాయి. కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 123 మంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న యాక్టివ్ కేసుల సంఖ్య 1663 గా ఉంది.