వరంగల్ (ఆరోగ్యజ్యోతి):వరంగల్ ఫోర్ట్ శుక్రవారం ఖిలా వరంగల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారు వైద్య శిబిరాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 22 వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా అంటువ్యాధులు దరిచేరే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకుని ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలని ఏదైనా జ్వరం జలుబు దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు సలహాలు పాటించాలని సుచిన్చినారు. డాక్టర్లు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అనంతరం కరోనా నేపథ్యంలో ప్రజలకు మాస్క్ లు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో యూ. పీ. ఎచ్. సి. ఫోర్ట్ వరంగల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ దేవి ,టీఆర్ఎస్ నాయకులు మరుపల్ల రవి , పుట్ట మోహన్ సి. ఓ , రాజేష్ హెల్త్ అసిస్టెంట్ , స్టాఫ్ నర్స్ రదపాక భాగ్యలక్ష్మి , భవాని, మెడికల్ అసిస్టెంట్ మాధవరావు , ఆశ వర్కర్ ఉషారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు .