హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 237 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 195, మేడ్చల్ 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5, మంచిర్యాల 3, వరంగల్ అర్బన్ 2, కామారెడ్డి 2, కరీంనగర్ 2, నిజామాబాద్ 2, మహబూబ్నగర్ 2, మెదక్, సిరిసిల్ల, అదిలాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్ రూరల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కరోనా తీవ్రతకు తోడు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,974 కేసులు నమోదు కాగా, ఇందులో 185 మంది మరణించారు. కాగా, ఆదివారం 23 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్గా తేలింది. హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న 140 మంది జర్నలిస్టులు విడుతలవారీగా కరోనా పరీక్షలు చేయించుకోగా, వారిలో 23 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.