24గంటలు..308 కేసులు

బెంగళూరు(ఆరోగ్యజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉద్ధతమవుతోంది. శనివారం 24గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో సుమారు 308 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6, 824 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ బులిటెన్‌ వెల్లడించింది. వీటిలో 3,092 యాక్టివ్‌ కేసులుండగా 3,698మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని, 84మంది మృతి చెందారని పేర్కొంది. కరోనా పరీక్షల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,36,518 శ్యాంపిళ్లను పరీక్షగా శనివారం ఒక్కరోజే 10,177 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.