ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 3,427 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో మరో 113 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 3,830కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,568కు పెరిగింది. ముంబై మహానగరంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.