మ‌హారాష్ట్ర‌లో కొత్తగా 3007 క‌రోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న‌ది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్ కేసులు, 91 మరణాలు సంభవించాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 85,975కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 3,060 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 43,591గా ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగాను కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,971 కేసులు నమోదు కాగా, 287 మంది ప్రాణాలు విడిచారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మహారాష్ట్ర, త‌మిళ‌నాడు, గుజరాత్‌, ఢిల్లీల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.