బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 515 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4835కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 3088 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్తో రాష్ట్రంలో 57 మంది మరణించారు. ఈ వైరస్ బారిన పడిన 1688 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 2,26,770 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,10,960 కేసులు యాక్టివ్గా ఉండగా, 1,09,462 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6348 మంది బాధితులు మరణించారు.