పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 

 - జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్

  ఇంద్రవెల్లి,(ఆరోగ్యజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం నాడు శ్యాంపూర్, పిట్టబొంగారం, ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొన్నట్లయితే ఈగలు దోమలు లేకుండా ఉంటాయని తెలిపారు .ఈగలు దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే ప్రజలు వ్యాధుల బారిన పడరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కరోనా రాకుండా ఉండేందుకు వ్యక్తిగత నియమాలను పాటించాలని తెలిపారు .ముఖ్యంగా మాస్కులు ధరించాలని,  సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఇలా చేయడం వల్లకరోన  వ్యాధి రాకుండా ఉంటుందన్నారు.