ముంబై: మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉన్నది. ప్రతి రోజు రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా 2,436 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 80 వేల మార్కును దాటి 80,229కి చేరింది.మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 139 మంది కరోనా రోగులు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,849కి చేరింది. ఇక మొత్తం కేసులలో ఇప్పటివరకు 35,156 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.