విధులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవు






 

- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య  ఉద్యోగులు, మెడికల్ పారామెడికల్ సిబ్బంది విధులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ అన్నారు. శుక్రవారం నాడు శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్ను  ఆకస్మికంగా  తనిఖీ చేశారు. తనిఖీ చేసిన సమయంలో ముగ్గురు సిబ్బంది గైర్హాజరు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డ్స్ కూడా సక్రమంగా లేకపోవడంతో ఆయన మండిపడ్డారు. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాలని లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం  ఆస్పత్రి ని పరిశీలించారు. వచ్చేది వర్షాలు కాలమని అన్ని రకాల మందులు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలను చిన్నారులకు, వేయించాలి అని తెలిపారు. మరోసారి సిబ్బంది గైరాజరు  అయితే చర్యలు తప్పవని హేచారించారు. ఏడు రోజుల తర్వాత మరోసారి వచ్చి ఆసుపత్రికి పరిశీలిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అయన వెంట   జిల్లా కోవిడ్ నిర్వహణ అధికారి డాక్టర్ వై సీ శ్రీనివాస్,జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్ తదితరులు ఉన్నారు.