హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరుకుంది.రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇవాళ ఆరుగురు మృతి చెందగా..63 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1491 మంది డిశ్చార్జవగా..88 మరణాలు చోటుచేసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,213 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది.