వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

వరంగల్(ఆరోగ్యజ్యోతి):వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లైతే వ్యాధులు దరిచేరవని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ మల్లికార్జున్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ సుచరిత అన్నారు.శనివారం నాడు న్యూ పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రగతికి మొదటి మెట్టు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అయిందని ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఎం సి డి ఇ, కె సి ఆర్ కిట్టు,  టీబీ ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అలాగే ఆస్పత్రికి ఔట్ పేషెంట్ ను పెంచేల కృషి   చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో డాక్టర్ మధులతా ,  ల్యాబ్ టెక్నీషియన్ కట్ల శోభారాణి , స్టాఫ్ నుర్సుస్ అరుణ , చైతన్య, ఆరోగ్య కర్యకర్తలు జయమణి , సరోజ , సరిత , మంజుల,  అకౌంటెంట్ అస్మిత , ఆశలు కర్యకర్తలు శిల్ప , భవాని తదితరులు పాల్గొన్నారు.