వరంగల్,(ఆరోగ్యజ్యోతి): అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చింతల్ ఆధ్వర్యంలో శనివారం నాడు మైసయ్యనగర్, శివనగర్, పర్తిచిపతెద్,ఈ సర్వేలో భాగంగా కరోనా వైరస్ పై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ సుర్విలన్సు ఆఫీసర్ డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ యేసు రవీందర్, డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనాసర్వేకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలన్నారు దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు .ఈ సర్వేలో భాగంగా కరోనా వైరస్ లక్షణాలు తో కూడిన ఒక వ్యక్తిని గుర్తించడం జరిగిందని టెస్ట్ లో పాసిటివ్ వచిందని వారు తెలిపినారు.ఈ కార్యక్రమంలో మలేరియ అసిస్టెంట్ ఆపిసర్ రవీందర్ కత్తి, సి.ఓ.మోహన్ రావు , సూపెర్వైసోర్ జిలకర రమేష్ & యూ.పీ.ఎచ్.సి. చింతల్ స్టాఫ్ ఉమా,నాగలక్ష్మి,పెనిన్నా,శ్రీలత,ప్రేమ లతా , ఉప్పలమ్మ,అశా వర్కర్ స్వాతి,రావాలా,సుమిత్ర అర్బన్ హెల్త్ సెంటర్ ఎంప్లాయిస్ చింతల్ పాల్గొన్నారు.