సీజనల్ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలి

 - డిఎంఎహ్ఓ  డాక్టర్ నరేందర్
తలమడుగు,తాంసీ(ఆరోగ్యజ్యోతి): సీజనల్ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర అన్నారు శుక్రవారం తలమడుగు,తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిచాలని అన్నారు. వర్షాకాలంలో పలు రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డయేరియా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు దరిచేరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపినారు. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరు  వ్యక్తిగత పరిశుభ్రతను పాటించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన పలు రకాల రిజిస్టర్ ఆయన తనిఖీ చేశారు.అనంతరం కెసిఆర్ కిట్టు , గర్భవతుల రిజిస్ట్రేషన్ వివరాలు ఇమ్యునైజేషన్, గర్భిణుల వైద్య పరీక్షలు తదితర వాటిపై అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు.డిఎస్ఓ  డాక్టర్ వై సి శ్రీనివాస్. జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ ఆనంద్, మండల వైద్యాధికాలు డాక్టర్ వాని, డాక్టర్ రాహుల్ సిబ్బంది తదితరులు ఉన్నారు