ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల పట్ల కొందరు దాడులకు పాల్పడడం సరైంది కాదని, గాంధీ ఆసు పత్రిలో వైద్యుడిపై దాడిని ఖండిస్తూ బుధవారం జిల్లా కేం ద్రంలోని రిమ్స్ ప్రధాన ఆసుపత్రిలో ఓపీ బ్లాక్ ఎదుట వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ నిరసనకు పలువురు సీనియర్ వైద్యు లు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘ నాయకుడు ప్రణయ్ మాట్లాడుతూ.. గాంధీ ఆసుప త్రిలో వైద్యులపై రోగి బంధువు దాడికి పాల్పడడం సరైంది కాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పిస్తేనే సేవలు అం దిస్తామని, లేని పక్షంలో నిరసనలు చేపట్టాల్సి వస్తుందని అ న్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు