- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి): కరోనా కోవిడ్( 19) వైరస్ నేపథ్యంలో ప్రజల కొరకు అహర్నిశలు తోడ్పడుతున్న డాక్టర్లకు సిబ్బందిసేవలు మరవలేనివి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ చింతల్ ప్రాంతంలోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్లకు సిబ్బంది మాస్కులు , పండ్లు పంపిణీ చేశారు . కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత మూడు నెలలుగా కరోనా వైరస్ మూలాన లాక్ డౌన్ విధించిన రోజు నుండి నేటివరకు కుటుంబాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు యూ. పి.ఎచ్ .సి. సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోమిశెట్టి శ్రీలత , కుందారపు రాజేందర్ , శామంతుల ఉషశ్రీ , వరంగల్ అర్బన్ డిఎం అండ్ ఎచ్ఓ డాక్టర్.కే. లలితా దేవి , డి.ఐ.వో డాక్టర్ గీతాలక్ష్మి , డిఎంవో డాక్టర్ వాణిశ్రీ , యూ.పీ.ఎచ్. సి. చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.రవీందర్ శ్రీదేవి , స్టాఫ్ నర్స్ లు సమీనా , రుబీనా , అకౌంటెంట్ వంగ రాజేష్ , డీ. మోహన్ రావు సీవో , రామా రాజేష్ ఖన్నా మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ , శ్రీలత , ఉమా , ప్రేమలత , నాగలక్ష్మి , ఆశ వర్కర్ లు అనూష స్వాతి సుమలత సుమిత్రా అనురాధ రాజనీల రవళి సబేరా తదితరులు పాల్గొనరు .