ఆసుపత్రి సూపర్డెంట్ గా డాక్టర్ ఆనంద్

  ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): బొథ్  సివిల్ హాస్పిటల్ సూపరిండేంట్ గా డాక్టర్ ఆనంద్ నియమించారు. ఇక్కడ సూపరిండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేందర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గా పదోన్నతి రావడంతో స్థానం ఖాళీ అయింది. డాక్టర్ నరేందర్ స్థానంలో ఆసుపత్రి సూపరిండేంట్ గా డాక్టర్ ఆనంద్ శనివారం నాడు నియమించారు. సూపరిండేంట్ తోపాటు జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి కూడా ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.డాక్టర్ ఆనంద్ గత కొంతకాలంగా సివిల్ హాస్పిటల్ లో డెంటల్ సర్జన్ గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అన్నిరకాల సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు ఆసుపత్రి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.