యుపిఎస్ వైద్య ఉద్యోగుల వేతనాలు పెంచండి


   హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  తెలంగాణలో వివిధ అర్బన్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పెంచాలని మంత్రి కేటీఆర్ కు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రామ రాజేష్ కన్నా అధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మెడికల్, పారామెడికల్ సిబ్బంది పని చేస్తున్నారని ఇందులో తొమ్మిది వేల మందికి ఉద్యోగులకు వేతనం పెరిగిందని, మరో 3 వేల మందికి వేతనం పేరగాల్సి ఉందని జీవో నంబర్ 510 ప్రకారం అర్బన్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని ఆయన కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి కేటీఆర్ కు వినతిపత్రం సమర్పించారు.