- జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇంటి ఆవరణలో ఇంటి చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని ఎప్పటికి అప్పుడు శుబ్రం చేసుకుంటే వ్యాధులు దరిచేరవని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు .ఆదివారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త కుమ్మరి వాడ, శ్రీ రామ్ కాలనీ, శాంతినగర్ కాలనీలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం సక్రమంగా ఉన్నట్లయితే వ్యాధులు దరిచేరవని అన్నారు ఇంటి ఆవరణ చుట్టూ చెత్తాచెదారం మురికి నీరు నిల్వ ఉండకుండ చూడాలని ప్రజలకు ఆతెలిపినారు. ప్రతి అదివారం ఇంటికి నీటికొరకు ఉపయోగించే కుండీలును శుభ్రం చేసుకొని ఇవ్వాలని సూచించారు . ఇంటి ఆవరణ చుట్టూ మురికి కాల్వలను కూడా శుబ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. వర్షాకాలం కావడం వల్ల నీటి నిల్వలు ఉన్నట్లయితే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమలు ఈగలు ద్వారా అతిసార లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు .శ్రీరామ్ కాలనీ, కొత్త కుమ్మరి వాడ, శాంతి నగర్ కాలనీలో ఇల్లిల్లూ తిరుగుతూ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రాజారెడ్డి . ఎస్ యు ఓ రఘునాథ్. కౌన్సిలర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.