తాంసీ,(ఆరోగ్యజ్యోతి): తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాంసీ సబ్ సెంటర్ పరిధిలో గల వడ్డది గ్రామంలో గర్భవతులకు శనివారం నాడు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్త సుగుణ మాట్లాడుతూ గర్భవతులకు అన్నిరకాల విటమిన్స్, మినరల్స్,ఐరన్ ,క్యాల్షియం అందాల లనే ఉద్దేశంతో పండ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి నెల నెల ఆరోగ్య కార్యకర్త వద్ద వైద్య పరీక్షలు చేయించుకోవాలి అన్నారు .వైద్య పరీక్షలు చేయించు కున్నట్లయితే కేసీఆర్ కిట్ తో పాటు ప్రభుత్వం ఇచ్చే నగదు కూడా అందుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఆస్పత్రిలో ప్రసవం అయితే తల్లి బిడ్డ క్షేమం గా ఉంటుందని దీనితో పాటు కెసిఆర్ కిట్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారు.ప్రసవం అయిన తర్వాత పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త లక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు మంగళ ,మమత, ఆశ కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.