మహబూబాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ,పుట్టినరోజు సందర్భంగా మథర్ షా ఇస్లామియా అనాథ ఆశ్రమంలో బాలురకు పండ్లు బిస్కెట్లు ను ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ధరవత్ విమల ,ముఖ్య సలహాదారుడు పొన్నోజు యశ్వంత్ పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన ప్రభావం ప్రజలు వాళ్ళ చాల ఇబ్బందులు పడుతున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. మునుముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చేసేందుకు ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ముందు ఉందన్నారు.