జిల్లా మలేరియా అధికారి గా డాక్టర్ శ్రీధర్

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా మలేరియా అధికారి గా పిట్ట బొంగరం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ను నియమించినారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ ఉత్తర్వులు జారీ చేశాడు.డాక్టర్ శ్రీధర్  ఏడాది పాటు తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గా పనిచేసినారు. 7 సంవత్సర లుగా పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గా పనిచేస్తున్నారు,  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మలేరియా నివారణ కు కొరకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. గతంలో అందరి సహాయ సహకారాలతో వల్ల మలేరియా నివారించగలిగినమని ఎప్పుడుకూడా  ప్రతి ఒక్క ఉద్యోగి సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వచ్చే వర్షాకాలం కావడం వల్ల ప్రజలు తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు. ఆవరణలో చెత్త చెదారం లేకుండ చూడలని  తెలిపినారు. వర్షాకాలంలో ప్రజలు నిటి  నిల్వలు  .ఉండకుండా చూడాలన్నారు. నిటి  నిల్వలు ఉన్నట్లయితే దోమలు ఉత్పత్తి చెంది మలేరియ బారిన పడతరని అన్నారు.