స్వస్తి ఆధ్వర్యంలోనిత్యావసర వస్తువుల పంపిణి

 


హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోన వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్ననిరుపేదలకు పేదలకు నిత్య అవసర వస్తువులను పంపిణి చేయడం జరిగిందని స్వస్తి చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ జి.కల్లన్ గౌడ తెలిపారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణలో ఎంపిక చేయబడిన జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎస్పీ ఇండియా స్వస్తి ఆధ్వర్యంలో నిధులు కేటాయించడం జరిగిందని, ప్రజల భద్రతా పరిశుభ్రత సామాగ్రి పంపిణీ చేసినట్లు అయన తెలిపినారు.తొమ్మిది స్వచ్ఛంద సంస్థలు ద్వారా 1200 మంది కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ కార్యకమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ పెద్దపల్లి లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కిట్ పంపిణీ ప్రక్రియ 2020 మే 28 నుండి ప్రారంభమై 2020 జూన్ 3 నాటికి పూర్తయింది. కమ్యూనిటీ సంస్థల నుండి 96 మంది సంఘ నాయకులు - స్పందనశ్రీ మైంత్రి శ్రీ పబ్లిక్  వెల్ఫేర్ సొసైటి , గోదావరికఖని, రుద్రమదేవి మహిళ మండలీ  వరంగల్, నవ్యశ్రీ మహిలా మండలీ  వరంగల్, వనితా మహిలా వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్, గాడ్ థెరిసా మహిళా మండలీ ఖమ్మం , స్వాగతి మహిలా మండలీ శ్రీకాకుళం, కిరణం మహిలా సమక్య సమితి విజయనగరం, ఉదయరేఖ మహిళా మండలి- తుని మరియు నారిసాక్షం రాజమహేంద్రవరం 1200 మంది కి  కిట్లను అందచేశారన్నారు.