వరంగల్,(ఆరోగ్యజ్యోతి): పట్టణం లోని న్యూ షాంపేట్ కాలనీలోఆశ్రయ అస్త్ర సహకారంతో, స్వస్తి వారి సౌజన్యంతో నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నవ్య శ్రీ మహిళా సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రేణుక మాట్లాడుతూ మా సంస్థ ద్వారా 17 రకాల వస్తువులను 30 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. గతంలో కూడా చాలా కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా మురికి వాడల్లో నివసించే పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మా సంస్థకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దేవమ్మ, మేనేజర్ ప్రభాకర్, గీత, మయూరి, అనిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.