జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్
ఆదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని చెట్లు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కాపాడిన వారవుతారని ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం భాగంగా జిల్లా వైద్య అధికారి కార్యాలయం ఆవరణలోచెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తన పుట్టిన రోజు కానీ పెళ్లి రోజు కానీ పిల్లల పుట్టిన రోజు సందర్భంగా చెట్లను నాటాలి అన్నారు. చెట్లు నాటడం వల్ల వాతావరణంలో మార్పులు రావడంతో పాటు సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. చెట్లు పెంచకపోవడం వల్ల ఉన్న చెట్లను నరకడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెట్లు పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని గత కొన్ని ఏళ్లుగా ఏర్పాటు చేసిందని దీని ద్వారా చెట్లు పెంచడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి డియంఎహ్ఓ డాక్టర్ సాదన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్, కోవేడ్ అధికారి డాక్టర్ వై సీ శ్రీనివాస్,డాక్టర్ కిరణ్, కార్యాలయ సూపరిండెంట్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.