ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): నూతనంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాథోడ్ నరేందర్ ఆదివారంనాడు శాఖా పరంగా చేపడుతున్న అన్ని రకాల పథకాల గురించి ఆన్లైన్లో పరిశీలించారు. ముఖ్యంగా ఎన్ఆర్హెచ్ఎం కు సంబంధించిన పథకాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆదివారం నాడు పరిశీలించారు. కుటుంబ నియంత్రణ, క్షయ, లెప్రసీ, ఎయిడ్స్ ,ఇమ్యునైజేషన్, ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో పని చేసిన పథకాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశాఖలో అమలవుతున్న పథకాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు.. కే సి ఆర్ కిట్లు ఏవిదంగా అందుతున్నాయి. వీటిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. గర్భవతులకు సక్రమంగా డబ్బులు పడుతున్నాయ, లేదా అనేవిషయం పై వైద్య అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకొని , సంబదిత అధికారులకు తెలపలన్నారు. గర్భవతులకు వైద్య పరిక్షలు , అన్నిరకాల టెస్ట్ లు చేయాలనీ తెలిపినారు.ప్రజలకు కు ఆరోగ్య పథకాలను అందించేందుకు అందరి సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు కు ఆరోగ్య పథకాలను అందించేందుకు అందరి సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం సంబంధించిన సర్వేలు, వ్యాధినిరోధకటీకాలు , గర్భ స్త్రీలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు ఆన్లైన్లో వారి అకౌంట్లు సబ్మిట్ చేయడం, నెలనెల రిపోర్టులు, గ్రామాల్లో లెప్రసీ, టిబి తో పాటు దీర్గకాళిక వ్యాధుల బారిన పడిన వారి పేర్లను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసే విధంగా ఆశా కార్యకర్తలు, మొదటి రెండవ ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు ,వైద్యాధికారి దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు .అలాగే ఆన్లైన్లో వెంటనే వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ డాక్టర్ వై సి శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్,ఎన్ ఆర్ హెచ్ ఎం డి పి ఎం యు స్వామి,డిడియం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.