హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చాల తక్కువగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.శుక్రవారం ప్రపంచ బాల కార్మికుల వ్యవస్థ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ పిల్లలతో పని చేయించే వారికి రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 20 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తారని,బాల కార్మికులు కనిపిస్తే 1098 చైల్డ్ లైన్ కు కాల్ చేయాలని ప్రజలకు ఆయన తెలిపినారు.పిల్లలు మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపినారు.పిల్లలను పనులలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్ చైల్డ్ అడా ల సెంట్ లేబర్ యాక్ట్ గా సవరణ చేసినట్లుగా ఈ సందర్భంగా తెలిపారు.