ఆదిలాబాద్,జైనథ్ (ఆరోగ్యజ్యోతి):ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం పరిధిలోగల మండగడలో గ్రామానికి చెందిన 67 సంవత్సరాల వృద్ధురాలు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 2న వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లింది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది .ఆ వృద్ధులకుకరోన ఉందని వైద్యులకు అనుమానం రావడంతో అక్కడి వైద్యులు కరోన పరిక్షలకోసం నమూనాలు తీసుకొని ఈ నెల 3న ఆమెను డిశ్చార్జ్ చేశారు. కరోన పాజిటివ్ వచ్చిందని అక్కడి వైద్యులు ఇక్కడ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు .జిల్లా అధికారులు అప్రమత్తమై గిమ్మ ప్రాతమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ నిర్మల, మండల సబ్ ఇంస్పెక్టార్ వెంకన్న ఆధ్వర్యంలో మంగళవారం ఆ గ్రామానికి వెళ్లివృద్ధురాలు ప్రత్యేక అంబులెన్సులు జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.