తెలంగాణలో ‌కొత్తగా 1018 కరోనా కేసులు

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ కొత్తగా మరో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైద‌రాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఏడుగురు మృతి చెందారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 17,357 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 267మంది మృతి చెందారు.తెలంగాణ‌లో ప్ర‌స్తుతం 9008 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇవాళ డిశ్చార్జైన‌వారు 788 మంది ఉండ‌గా, మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 8082 మంది డిశ్చార్జ‌య్యారు. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 36 కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 33, మహబూబ్ నగర్  జిల్లాలో 10 కేసులు, వరంగ‌ల్ , మంచిర్యాల‌లో 9 చొప్పున‌  కేసులు నమోదయ్యాయి.