‘108’లో ప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం

ఉట్నూరు,(ఆరోగ్యజ్యోతి): ఉట్నూరు మండలం మరపగూడకు చెందిన గర్భిణి రంజనకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో భర్త జలపత్‌రావు ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు రిమ్స్‌కు రెఫర్‌ చేయడంతో ‘108’ అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో ఆమె ఆడశిశువుకు ప్రసవించిందని ఈఎంటీ రఘుపతిరెడ్డి, పైలెట్‌ లఖన్‌సింగ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు