ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సులో కరోన అనుమానితులు





 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ ఎం జి బి ఎస్ బస్టాండ్ నుండి బయలుదేరి ఆదిలాబాద్ కు   రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చేరుకున్న సూపర్ లగ్జరీ నంబర్ (TS08Z0229)బస్సు లో ప్రయాణించిన ప్రయాణికులు ముగ్గురు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రయనిచారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్  నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే బస్సులో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వచ్చిన లేక నిర్మల్ నుండి ఆదిలాబాద్ కు వచ్చిన మిగతా ప్రయాణికులు స్వచ్ఛందంగా రిమ్స్ ఆస్పత్రికి వచ్చి కరోన  పరిక్షలు   చేసుకోగలరని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరారు.