మెడికల్  పారామెడికల్ సిబ్బంది పై వేధింపులను ఆపాలి

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి):  మెడికల్  పారామెడికల్ సిబ్బంది పై వేధింపులను ఆపాలని  కరోనా డ్యూటీలో పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని  పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక భద్రత కల్పించాలి తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ (హెచ్1) యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి డిమాండ్ చేసినారు.కరోనా వైరస్ ను అరికట్టడంలో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్  పారామెడికల్ ఆశ వర్కర్లు చేస్తున్న సేవలను సమాజం గుర్తించినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ లోని ఉన్నతాధికారులు గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని అయన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత ప్రజల నిర్లక్ష్యం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని అయన తెలిపారు. కరొన వైరస్ కేసులు అరికట్టేందుకు పారామెడికల్ సిబ్బంది ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ ,ఫార్మసిస్ట్ , మెడికల్ అసిస్టెంట్ , ఆశ వర్కర్లు నిరంతరం కృషి చేస్తున్నారని వారి సేవలను ప్రభుత్వం గుర్తించాల్సిన అధికారులే డ్యూటీలో పేరుతో వేధింపులకు పాల్పడడం బాధాకరమైన విషయం అని అన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ పేరిట ఆశా కార్యకర్తలకు నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు జారీ చేయడం సబబు కాదన్నారు. హైదరాబాద్ , రంగారెడ్డి , మేడ్చల్ , జిల్లా పరిధిలోని జిహెచ్ఎంసి పరిధిలో పనిచేసే పారామెడికల్ సిబ్బంది తో పాటు ఆశ వర్కర్లు కరొన ఏరియాలో పరీక్షలు చేయాలని బెదిరింపులకు దిగడం సబబు కాదన్నారు. యూ. పి హెచ్ సి పరిధిలో పనిచేసే ఆశా వర్కర్లకు రొటేషన్ పద్ధతిన డ్యూటీలు వేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల తమ పనులను పక్కనపెట్టి వారికి సంబంధం లేని పనులు ఎక్కువ చేయిస్తున్నారని తెలిపారు. ఆశా వర్కర్లు పారామెడికల్ సిబ్బంది పై రోజు రోజుకి వేధింపులు పెరుగుతున్నాయని ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతకుమారి ,డైరెక్టర్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తామని అయన  తెలిపారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా తమ వేధింపులను మాను కొని కోవిద్ -19 ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.