ఆదిలాబాద్, గుడియత్నూర్.(ఆరోగ్యజ్యోతి): వర్షాకాలం కావడం వల్ల వ్యాధులు దరి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. గురువారం నాడు గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గురజ సబ్ సెంటర్ లో డెంగ్యూ పాజిటివ్ రావడంతో ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రంగా ఉంఛినట్లయితే వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గ్రామంలో మురికి కాలువలు చెత్తాచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. కుళాయిలు బోరింగ్ వద్ద నీటి నిల్వ ఉంచకుండా చూడాలని తెలిపారు. డెంగ్యూ ,మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ముందు పరిశుభ్రత పాటించాలన్నారు, అప్పుడే ఈ వ్యాధులు దరిచేరవని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్. ఎస్ యు ఓ రఘునాథ్. హెచ్ ఈ ఓ రవీందర్. హెల్త్ సూపర్వైజర్ అనసూయ. ఎన్ టి ఎస్ లు ఉదయ్ .అనిల్ ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.