తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా
వరంగల్,(ఆరోగ్యజ్యోతి):కరోణ వైరస్ నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా అన్నారు. కరోణ వైరస్ నియంత్రణ కొరకు వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి 03న రోజున వినతి పత్రం లేఖ రాయడం జరిగిందన్నారు.. ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తక్షణమే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డాక్టర్లు పారా మెడికల్ సిబ్బందికి కంటోన్మెంట్ జోన్లలో రెడ్ జోన్లలో అనునిత్యం వైద్య సేవలందిస్తూ కరోణ వైరస్ పాజిటివ్ వచ్చి మరణించడం జరుగుతుంది ప్రభుత్వం వైద్య ఉద్యోగులందరికీ 50 లక్షలు ఇన్సూరెన్స్ వార్తపై చేయించాలని ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇళ్ల స్థలాలు 30 లక్షల నగదు సహాయం అందించాలని అన్నారు.
ఇటీవల చెస్ట్ ఆస్పత్రి లో కరోనా వైరస్ విధులు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చి చనిపోయిన హెడ్ నర్స్ జయమని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అలాగే 05-09-2018 ఎం. ఎస్ .నెంబర్ 510 జి. ఓ. లో 3000 మందికి జీతాలు పెంచలేదు వీరికి వేతనం పెంచాలిని చెప్పారు , పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ ఆర్గనైజర్లు , డేటా ఎంట్రీ ఆపరాతోర్స్ , మెడికల్ అసిస్టెంట్ , అకౌంటెంట్ క్లర్క్ , వాచ్ మెన్ , స్వీపర్ తదితర సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని కోరడం జరుగుతుందన్నారు. వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహృదయం తో ఆలోశించి మా సమస్యలు పరిష్కరించాలని అన్నారు