జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్
ఆదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): డెంగీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడుదామని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ పుతిలిబౌలి లో డెంగ్యు పై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల మోత్తం డెంగ్యూ నెలగా ఉందని పేర్కొన్నారు .డెంగ్యూ మాసం సందర్భంగా ప్రతి రోజు డెంగ్యూ పై అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కూలర్లు నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ముందుగా డెంగ్యూ వ్యాధి అవగాహన పై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినోద్, బి రఘునాథ్. సభనాజ్, నవీన్, అనిల్, ఉదయ్, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.